వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్.

గచ్చిబౌలి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ వి. గంగాదర్ రెడ్డి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్లగుండ్ల హుడా కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం హుడా రెసిడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

వినాయక మండప నిర్వాహకులు కార్పోరేటర్ గంగాదర్ రెడ్డిని ఘనంగా సన్మానించి, ఆయనకు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజించడం వలన చేపట్టే పనుల్లోని అడ్డంకులు తొలగుతాయని, విజయవంతంగా ముందుకు సాగగలమని వ్యాఖ్యానించారు.

Also Read : ఆస్తి కోసం బావమరిదిని హత్య – పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు

అనంతరం కార్పోరేటర్ గంగాదర్ రెడ్డి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగుండ్ల రెసిడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు హనుమంతు నాయక్, హుడా కాలనీ అధ్యక్షుడు జలేందర్ రెడ్డి, కోశాధికారి దొరబాబు మరియు సీనియర్ నాయకులు సహా పలువురు స్థానికులు, మహిళలు పాల్గొన్నారు.

Share this post with your friends

Follow US

Most Popular