Telangana: రోడ్డు విస్తరణలో హామీ ఇచ్చాం,అమలు చేశాం

గ్రామపంచాయతీ అభివృద్ధి విషయంలో రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా గ్రామస్తులు,పాలకమండలితో కలిసి తనవంతుగా కృషి చేశానని మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో కొన్ని రోజుల క్రితం రేడియోల యాదయ్య ఇంటి నుండి లక్ష్మణ్ జీ ఇంటి వరకు గ్రామపంచాయతీ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని, రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుకుగా ఉన్న రోడ్డులో తన సొంత ఇంటి స్థలాన్ని కొంత భాగం గ్రామపంచాయతీకి ఇవ్వాలని కోరగా ఆ స్థల యజమానులు కోశిక పుష్పమ్మచెన్నయ్య అందుకు ఒప్పుకొని వారి ఇంటి నిర్మాణానికి చేయూత అందించాలని కోరగా అందుకు హామీ ఇవ్వడం జరిగిందని సర్పంచ్ తెలిపారు.

Also Read : ఆనంద్ మహీంద్రా ఈ పోలీసును ఎందుకు మెచ్చుకున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబానికి 50 వేల రూపాయల నిర్మాణపు సామాగ్రిని ఈ రోజు స్థానిక నేతలతో కలిసి అందజేయడం జరిగిందని లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పదవులు ఉన్నా, లేకున్నా ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో లాయక్ అలీ,మంగల్ పల్లి నరసింహ, చేగూరి రాములు, కందికంటి శ్రీరాములు, మూడ అశోక్ కుమార్, బోసు వెంకటేష్, కొప్పు కృష్ణ, కాలే శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends

Follow US

Most Popular