Telangana: దేశంలో కార్పోరేట్ కు మించిన పాఠశాలలు గురుకులాలు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

  • గచ్చిబౌలి, గౌలిదొడ్డిలోకి గురుకుల విద్యార్థుల నిరసనకు బీఆర్ఎస్ మద్దతు
  • తరలివచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు

Telangana: దేశంలోనే కార్పోరేట్ కు ధీటుగా పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో ఆనాటి ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన గచ్చబౌలి గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు బాల్క సుమన్,గువ్వల బాల్ రాజు విద్యార్థుల వద్దకు వెళ్లి సంఘీబావం తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదివే ఈ పాఠశాలలు అని తెలిపారు. మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో గురుకుల బోర్డులో చర్చించి ఓపెన్ మార్కెట్ లో ఉత్తమ ఉపాధ్యాయులు, లెక్చరర్లను రిక్రూట్ చేశారన్నారు.

Also Read:  భారీ వర్షం..రాకపోకలకు అంతరాయం

అటువంటి వ్యవస్థలో ఉన్న గురుకులాల్లో నేడు వాళ్లందరినీ విధుల నుంచి తీసేయడం దారుణమన్నారు. గురుకులాలను కాపాడాల్సిన బాద్యత ఉందని పూర్వ విద్యార్థులు కూడా కలిసి రావాలని కోరారు. గురుకులాల్లో వ్యవస్థ ను మెరుగు పరిచే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share this post with your friends

Follow US

Most Popular