Gachibowli : నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Gachibowli : గచ్చిబౌలి లోని ఓ హోటల్ లో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన శృతి (23) గచ్చిబౌలి లోని రెడ్ స్టోన్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గతంలో యువతి యశోద ఆస్పత్రిలో నర్సుగా పని చేసినట్లు తెలిపారు. అయితే కొంతకాలంగా ఉద్యోగం వదిలి సొంత ఊరికి వెళ్లినట్లు తెలిపారు.

Also Read: గచ్చిబౌలి లో రేవ్ పార్టీలోయువతీయువకులు

తిరిగి మళ్లీ శృతి గచ్చిబౌలి వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా గచ్చిబౌలి లోని చిన్న అంజయ్య నగర్ లో గల రెడ్ స్టోన్ హోటల్ లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ‌పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానాకు తరలించినట్లు తెలిపారు.

Share this post with your friends

Follow US

Most Popular