Sherilingampally: కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు

  • -హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

Sherilingampally: తాను కాంగ్రెస్ కండువా కప్పు కోలేదని, సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సమయంలో కూడా తనకు ఆలయానికి సంబందించిన కండువా కప్పారని అన్నారు. తాను పార్టీ మారలేదని అందుకే పీఏసీ పదవి ఇచ్చారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ఓ మీడియాతో మాట్లాడారు. తనకు పీఏసీ పదవి ప్రభుత్వం ఇవ్వగానే హరీష్ రావు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: సున్నం చెరువు కబ్జాల కూల్చివేత

దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎలాంటి పరిణామాలాకైనా సిద్దంగా ఉన్నానని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు గత పదేళ్ల లో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ ను కలిసినప్పుడు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని తెలిపారు. బీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్యే గా గెలిచానని అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తానని అన్నారు. హరీష్ రావుకు ఆ పదవి పట్ల ఆసక్తి ఉనట్లుందని అందుకే ఓర్చుకోలేక వ్యాఖ్యలు చేస్తున్నారని ముడిపడ్డారు.

Follow US

Most Popular