Bollaram : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గణేష్ ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా అందంగా అలంకరించిన మండపాల్లో గణనాథులను ప్రతిష్ఠించారు. అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఆయా మండపాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కాగా ఆయా కాలనీలో ఏర్పాటు చేసిన గణేణ్ మండపాలను జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలాన్ బాల్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో కొలన్ బాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
Trending Now