serilingampally: శేరిలింగంపల్లి పరిదిలోని ఆయా చెరువులను శనివారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా నవరాత్రుల తరువాత నిర్వహించే నిమజ్జనోత్సవంలో భాగంగా చెరువులను పరిశీలించినట్లు తెలిపారు. వినాయకులను నిమజ్జనం చేసే మల్కం చెరువు, గోపి చెరువు, నల్లగండ్ల చెరువు, గంగారాం, గుర్నాథం, బేబీ పాండ్, కైదాం కుంట, దుర్గం చెరువులను ఆయన పరిశీలించారు.
Also Read: మేమే కూల్చేస్తాం ..హైడ్రా అవసరం లేదు
ఈ సందర్భంగా నిమజ్జనానికి సంబందించిన ఏర్పాట్లు పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ఆయా చెరువుల వద్ద తగిన బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, అన్ని కార్యాచరణలను సమన్వయంతో అమలు చేసేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. సానిటేషన్, పాగింగ్ యంత్రాలతో, ఎలక్ట్రిక్ బృందాలు అవసరమైన పరికరాలతో అందుబాటులో ఉండాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈయన వెంట ఏస్ఈ, డీసీ, ఈఈ, డిప్యూటీ ఈఈ, ఏఈ, ఈఈ, ఏఎంఓహెచ్, శానిటరీ సూపర్ వైజర్లు, రామ్ కీ ఎజన్సీ బృందం, ఏఈలు, ఎంటమాలజీ విభాగం అధికారులు ఉన్నారు.