Sherlingampally Hydra : శేరిలింగంపల్లి పరిదిలోని మదీనాగూడ ఈర్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లను అధికారులు శనివారం కూల్చి వేశారు. నిర్మాణాలు చేపట్టిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈర్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం చేపట్టారని అధికారులకు ఫిర్యాదు అందింది. హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందడంతో కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటికే రెండు ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. మరో నిర్మాణాన్ని పాక్షికంగా కూల్చివేశారు.
Also Read: N కన్వెన్షన్ కూల్చివేతను స్వాగతిస్తున్నాం
కాగా తాజాగా నిర్మాణాలు చేపట్టిన వారిపై ఇరిగేషన్ ఏఈ పావని మియాపూర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్టీఎల్ లో ఇంటి నిర్మాణాలు చేసిన స్వర్ణలత, కృష్ణకిషోర్ లపై 326(ఎ), 329 (3) బీఏన్ఎస్, పీడీపీపీఏ యాక్టుల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.