Bollaram: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్పబస్తి’లో నివసించే కర్ణాటక వాసి రాజ్యమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి అండగా నిలుస్తూ వి.వి.ఆర్ ఫౌండేషన్ తరఫున అంత్యక్రియల నిమిత్తం అయిదు వేల(5,000/-rs) రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
Also Read: అతివేగానికి యువకుని బలి
కష్టకాలంలో అండగా నిలిచిన వివిఆర్ ఫౌండేషన్ సభ్యులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు భాస్కర్ గారు, స్థానికులు రాజు గారు, సురేష్ గారు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.