- అదుపులోకి తీసుకున్న పోలీసులు
Sherilingampally: గుట్టు చప్పుడు కాకుండా.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై బుదవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు అందిన వివరాల ప్రకారం పోలిసులు ఆ వ్యభిచార గుట్టును రట్టు చేశారు. చందానగర్ పోలీస్ స్టేషను పరిధిలోని బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. జనావాసాల మద్య దందా సాగిస్తూ దర్జాగా ధనార్జనకు పాల్పడుతున్నారు.
Also Read: ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉంటే సహించేది లేదు..
పాడు పని అని తెలిసినా.. నిసిగ్గుగా వ్యభిచార వృత్తిని ఎంచుకుంటూ ధర్జాగా కాసులు కోసం కక్కుర్తి పడుతున్నారు. కాలనీలోని 1546 నంబరు గల ఇంటిలో ఈ దందాను సాగిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. రాజు అనే యువకుడు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. విధి నిర్వహణలో
కాగా నిర్వాహకుడు రాజు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు. కాగా పోలీసులు నలుగురు యువతులతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వ్యభిచార గృహంలో పనిచేస్తున్న లక్ష్మి అనే మజిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సంఘటనకు సంబందించి చందానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా లక్ణ్మి అనే మహిళను విచారిస్తున్నట్లు వివరించారు. దొడ్డిదారిలో .. సంపాదన కోసం దిగజారడం.. ఇటువంటి సంఘటనలు సభ్య సమాజానికి సిగ్గు చేటుగా మారుతుంది.