Telangana: వీధీ దీపాలపై జెడ్ సి సమీక్ష

జోన్‌ పరిధిలోని వీధి దీపాల నిర్వహణపై జడ్సీ ఉపేందర్‌రెడ్డి తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి దీపాల నిర్వహణపై పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని, పని చేయని వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీ రహదారులపైనా ఎక్కడ వీధి దీపాలు పని చేయకపోయిన మార్చాలన్నారు.

Also Read : జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి..!!

ఇప్పటికే జోన్‌ పరిధిలోని పలు ప్రాంతాలలో నెలకొన్న వీధీ దీపాలపై ఫిర్యాదులు అందుతున్నాయని, ఆగస్టు 3 లోగా అన్నింటినీ పరిష్కరించాలని జడ్సీ ఆదేశించారు. ప్రతి నిత్యం వచ్చే ఫిర్యాదులను ప్రాంతాల వారిగా విభజించి స్థానిక సిబ్బందికి పురమాయించి తగు చర్యలు చేపట్టాలన్నారు. కార్యాలయంతో ట్విటర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని జడ్సీ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో ఎలక్టికల్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Follow US

Most Popular