Bollaram: ప్రజల కోసం పోరాడే వారికి అండగా నిలవండి..

Bollaram: ప్రజల కోసం పోరాడే వారికి అండగా ఉండాలని బొల్లారం మున్సిపల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. గతంలో జీవో 59 కింద డబ్బులు చెల్లించినా వారికి ప్రభుత్వాలు ఎటువంటి మేలు చేయడం లేదన్నారు. ఎన్నో ఆశలతో ప్రజలు డీడీలు చెల్లించిన గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

అనేక మంది బాధితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం 2016, 2018, 2020లో జీవో తెచ్చిందని అయినా గత ప్రభుత్వం చొరవ చూపలేదన్నారు. ఇదే విషయమై తాను గతంలో 2022లో బొల్లారం నుంచి జిన్నారం వరకు పాదయాత్ర చేశానని ఆయన గుర్తు చేశారు.

ఎమార్వోకు వినతిపత్రం అందజేసిన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని, సంవత్సరాల తరబడి ప్రజలు సర్టిఫికెట్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మరోసారి ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి తాను ఈ నెల 30న గాందీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే వారికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. జీవో 59 బాధితుల కోసం చేపట్టే దీక్ష కార్యక్రమానికి బాదితులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలపాలని ఆయన కోరారు

Follow US

Most Popular