Telangana: కాంగ్రెస్ లోకి.. ఎమ్మెల్యే అరికెపూడి గాందీ

కారు దిగుతున్న ఎమ్మెల్యేలు..

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వరుస చేరికలతో కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లో నుంచి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ల సంఖ్య 8కి చేరింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాందీ బీఆర్ఎస్ కు షాకిచ్చారు.

కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే అరికెపూడి గాందీకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సీఎం పార్టీలోకి ఆహ్వనించారు. గత రెండు మూడు రోజుల క్రితం ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ను పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు కలిశారు. ఆ తరువాత శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాందీ కాంగ్రెస్ లో చేరడంతో గ్రేటర్ లో ఇంకెంత మంది కారు దిగుతారనే చర్చ మొదలైంది.

ఏది ఏమైనా రోజు రోజుకు కారు దిగి హస్తం గూటికి చేరుతున్న వారు పెరిగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రములో బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఎమ్మెల్యే లను గెలుచుకుంది. కాగా ఇంకా ఎంత మంది గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు కారు దిగుతారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ల వరుస చేరికలతో కాంగ్రెస్ లో జోష్ కన్పిస్తుంది.

Follow US

Most Popular